అమరావతి: ఏపీ ప్రభుత్వం దీపావళి సెలవు ప్రకటించింది.
దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని ఈనెల 13వ తేదీని (సోమవారం) రాష్ట్ర ప్రభుత్వం సాధారణ సెలవు దినంగా ప్రకటించింది. ఈ విషయాన్ని ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కెఎస్.జవహర్ రెడ్డి తెలియజేశారు.
ఈమేరకు రాష్ట్ర సాధారణ పరిపాలన శాఖ జీఓ 2167 ద్వారా – 13వ తేదిని – ప్రభుత్వ సెలవు దినంగా ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
నవంబర్ 11 రెండో శనివారం, 12 ఆదివారం కావడంతో ఒకేసారి పండుగకు మూడు సెలవులు వచ్చినట్లయింది.






